హైదరాబాద్, 22 జూన్ (హి.స.)
నాన్ టాక్స్ రెవెన్యూ రాబడులను పెంచడంపై అధికారులు సీరియస్ గా దృష్టి సారించాలని ఇన్ ఫ్రా స్ట్రక్చర్ అండ్ కేపిటెల్ సబ్ కమిటీ ఛైర్మన్ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశించారు. ఈ రోజు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో జరిగిన అసెట్స్ సబ్ కమిటీ మంత్రివర్గ ఉప సంఘం భేటీలో మంత్రులు, కమిటీ సభ్యులైన ఉత్తం కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమీక్షా సమవేశం నిర్వహించారు. నాన్ టాక్స్ రెవెన్యూ తో పాటుగా కేంద్ర నిధులను కూడా సాధించుకోవలని చెప్పారు. గత ప్రభుత్వ పథకాలను ఒక్కటి కూడా ఆపకుండా కొత్తగా 33,600 కోట్ల రూపాయల సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి చెప్పారు. అధికారంలోకి వచ్చిన 2023-24 ఆర్థిక సంవత్సరంలో మన ప్రభుత్వానికి ఔటర్ రింగ్ రోడ్, ఎక్సైజ్ ఆదాయాలు రాకుండా పోయాయని ఆయన చెప్పారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ కానుక, మహాలక్ష్మి, ఉచిత కరెంట్, ఇందిరమ్మ ఇండ్లు సహా పలు కొత్త పథకాలను ప్రజలకు ఇస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి చెప్పారు.
బడ్జెట్ నిధులు కొన్ని శాఖలు అధికంగా, మరికొన్ని శాఖలకు అతి తక్కువగా అందుతున్నాయి. బడ్జెట్ ని అన్ని శాఖల, డిపార్ట్మెంట్లకు సమానంగా పంచాలి. డిపార్ట్మెంట్ల మధ్య ఖర్చు అంతరాలను తగ్గించి.. అన్నింటిని ఒకే స్థాయిలోకి తీసుకురావాలని అధికారులను ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు. బడ్జెట్ క్కటాయింపులను అన్ని శాఖలు, డిపార్ట్మెంట్లకు సమానంగా పంచబడాలి. అలాగే రాష్ట్రంలోని అన్ని నియోజక వర్గాల్లో పెండింగ్ లో ఉన్న మేజర్ ప్రాజెక్టులను ప్రాముఖ్యతను అనుసరించి వెంటనే పూర్తి చేయాల ఆదేశాలు జారీ చేశారు.
రాష్ట్రం అవసరాలను, ప్రాముఖ్యతల మేరకు బడ్జెట్ నిధులను ఖర్చు చేయాలి. డిపార్ట్స్ ఖర్చులను కూడా రేషనలైజేషన్ చేసుకుని ప్రయారిటీల అధారంగా ముందుకు వెళ్లాలి. రెవెన్యూ తీసుకువచ్చే శాకలు, డిపార్ట్ మెంట్లపై సీరియస్ గా దృష్టి సారించాలి. అవసరాల మేరకు ఖర్చును చేయాలని సూచించాను. స్టేట్ రియలిస్టిక్ గా, లాజికల్ గా ఖర్చులను చేయాలని అధికారులకు ఉప ముఖ్యమంత్రి చెప్పారు. రెవెన్యూను పెంచడం, నాన్ టాక్స్ రెవెన్యూపై అధికారులంతా సీరియస్ గా దృష్టి సారించాలన్నారు.
పబ్లిక్ ఇంట్రస్ట్, అభివృద్ధి, ప్రజా సంక్షేమం, ప్రజా ప్రభుత్వం ఆలోచనల మేరకు అందరూ పని చేయాలని అన్నారు. రేషనలైజేషన్ మేరకు పనులను పూర్తి చేయాలి. స్పిల్ ఓవర్ వర్క్స్ కూడా ప్యారిటీల మేరకు పూర్తి చేయాలన్నారు. అన్ని శాఖలు సమానంగా అభివృద్ధి చెందితేనే.. రాష్ట్రం సంపూర్ణ స్థాయిలో ముందకు వెళుతుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాక రాబోయే పది రోజుల్లో రేషనలైజేషన్ పూర్తి చేసి సమగ్రమైన ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు.
ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఆర్థిక శాఖ ప్రిన్పినల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా అన్ని శాఖల ఉన్నతాధికారులు పాల్గోన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు