తెలంగాణ, నిజామాబాద్. 21 జూన్ (హి.స.)
విద్యుత్ కోతలకు నిరసనగా
నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లిలో విద్యుత్ సబ్స్టేషన్ను రైతులు ముట్టడించారు. డీఈ వచ్చి తమ సమస్యను పరిష్కరించే వరకు కదిలేదని నిరసనకు దిగారు. ఓవైపు వర్షాలు లేక పంటలు ఎండిపోయే పరిస్థితికి చేరుకున్నాయని, మరోవైపు అధికారులు తరచూ విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగిస్తూ సాగునీటిని అందించుకోకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గృహ విద్యుత్ సరఫరాలో కూడా నిత్యం కోతలు విధిస్తున్నారని, సమస్యను అధికారులకు దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదంటూ సబ్జెస్టేషనన్ను ముట్టడించారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు