11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం-2025 జరుపుకున్నదక్షిణ మధ్య రైల్వే దక్షిణ మధ్య రైల్వే
అమరావతి, 21 జూన్ (హి.స.) 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని సికింద్రాబాద్‌లోని రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లోని ఇండోర్ స్టేడియంలో ఈరోజు అనగా జూన్ 21 2025న నిర్వహించింది. ఈ సందర్భంగా దక
11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం-2025 జరుపుకున్నదక్షిణ మధ్య రైల్వే  దక్షిణ మధ్య రైల్వే


అమరావతి, 21 జూన్ (హి.స.)

11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని సికింద్రాబాద్‌లోని రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లోని ఇండోర్ స్టేడియంలో ఈరోజు అనగా జూన్ 21 2025న నిర్వహించింది. ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ అరుణ్ కుమార్ జైన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ శ్రీ నీరజ్ అగ్రవాల్, ప్రిన్సిపల్ చీఫ్ పర్సనల్ ఆఫీసర్ శ్రీ సిద్దార్థ కటి , ప్రధాన కార్యాలయంలోని వివిధ శాఖలకు చెందిన ప్రధానాధిపతులు, అధికారులు , సిబ్బంది ఆర్‌పిఎఫ్ సిబ్బంది మరియు స్కౌట్స్ & గైడ్ స్ వాలంటీర్లు కూడా పెద్ద సంఖ్యలో ఈ యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. జోన్‌లోని ఇతర సిబ్బంది మరియు అధికారులు పాల్గొనడానికి వీలుగా ప్రోగ్రామ్ యొక్క ప్రత్యక్ష ప్రసారం దక్షిణ మధ్య రైల్వే సోషల్ మాద్యమం ద్వారా కూడా ప్రసారం చేయడం జరిగింది.

ఈ సందర్భంగా జనరల్ మేనేజర్ శ్రీ అరుణ్ కుమార్ జైన్ గారు మాట్లాడుతూ ¬యోగా అనేది ఒక జీవన విధానమని , ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి మరియు అంతర్గత శాంతిని పొందడానికి క్రమం తప్పకుండా సాధన చేయాలని అన్నారు. ఒత్తిడి లేని జీవితాన్ని గడపడంపై తన విలువైన అంతర్దృష్టులను పంచుకున్నందుకు, నేటి యోగా సెషన్‌ను నిర్వహించినందుకు ప్రఖ్యాత యోగా గురువు శ్రీ మురారి మోహన్‌ను ఆయన అభినందించారు.

శ్రీ మురారి మోహన్ గారు ప్రముఖ యోగా టీచర్ మరియు ఆర్ట్ ఆఫ్ లివింగ్ సొసైటీ రాష్ట్ర సమన్వయ కర్త హైదరాబాద్. వీరు ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానం మరియు సంకల్పం మొదలైన వాటితో కూడిన సెషన్‌ను నిర్వహించారు. శ్రీ మురారి మోహన్ గారు యోగా సాధన వల్ల కలిగే ప్రయోజనాలను పంచుకున్నారు. యోగా కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదని, మనస్సు, శరీరం మరియు ఆత్మ యొక్క పూర్తి సామరస్యానికి ఒక మార్గమని ఆయన పేర్కొన్నారు. శారీరక మరియు మానసిక శ్రేయస్సును మెరుగుపరచడానికి సిబ్బంది సభ్యులు క్రమం తప్పకుండా యోగాప్రక్రియను సాధన చేయాలని ఆయన ప్రోత్సహించారు.

అంతకుముందు, జనరల్ మేనేజర్ మరియు ఇతరులు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవం -2025 ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించారు. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ ఇతర ప్రముఖులతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొని యోగా ఔత్సాహికులను ఉద్దేశించి ప్రసంగించారు.

అంతర్జాతీయ యోగా దినోత్సవం 2025: 2025 అంతర్జాతీయ యోగా దినోత్సవం అంశం “ఒకే పుడమి , ఒకే ఆరోగ్యం కోసం యోగా “. ఈ అంశం వ్యక్తిగత శ్రేయస్సు మరియు గ్రహ ఆరోగ్యం యొక్క పరస్పర సంబంధాన్ని నొక్కి చెబుతుంది. ఇది భారతదేశం యొక్క G20 అధ్యక్షత దార్శనికత ఒక భూమి, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తు కు అనుగుణంగా ఉంటుంది. యోగాలో ధ్యానం మరియు శ్వాసక్రియలను చేర్చడం వల్ల వ్యక్తి మానసిక శ్రేయస్సు మెరుగుపడుతుంది. క్రమం తప్పకుండా యోగాభ్యాసం చేయడం వల్ల మానసిక స్పష్టత మరియు ప్రశాంతత ఏర్పడుతుంది; శరీర అవగాహన పెరుగుతుంది; దీర్ఘకాలిక ఒత్తిడి నమూనాలను తగ్గిస్తుంది; మనస్సును సడలిస్తుంది; దృష్టిని కేంద్రీకరిస్తుంది; మరియు ఏకాగ్రతను పదునుపెడుతుంది,

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande