అమరావతి, 22 జూన్ (హి.స.)
నెల్లూరు(స్టోన్ హౌస్ పేట): ముఖ్యమంత్రి నారా చంద్రబాబు వినూత్నంగా ప్రవేశపెట్టిన పీ4 కార్యక్రమంలో భాగంగా అట్టడుగు వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నట్లు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ఆదివారం నెల్లూరు వీఆర్ హైస్కూల్లో చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతిని రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఛైర్మన్ అబ్దుల్ అజీజ్, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డితో కలసి మంత్రి నారాయణ పరిశీలించారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని నిర్వాహకులను ఆదేశించారు.
ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ.. చిన్నతనంలో తనకు విద్యాబుద్ధులు నేర్పించి, ఉన్నత స్థితికి కారణమైన వీఆర్ మున్సిపల్ హైస్కూల్ను
అభివృద్ధి చేయటం కనీస బాధ్యతగా భావించానని తెలిపారు. ఇందుకు తన కుమార్తెలు ముందుకు వచ్చారని, పాఠశాల ఆధునికీకరణలో భాగం పంచుకున్నారన్నారని వివరించారు. పేద విద్యార్థులకు ప్రాధాన్యత ఇచ్చి వారికి ప్రవేశాలు కల్పించినట్టు చెప్పారు. అడ్మిషన్ల కోసం విపరీతమైన డిమాండ్ ఏర్పడిందన్నారు. దాంతో ఒకటి నుంచి 9వ తరగతి వరకు రెండు సెక్షన్లకు బదులు మూడు సెక్షన్లు ప్రారంభిస్తున్నామని తెలిపారు. వచ్చిన దరఖాస్తుల్లో అత్యంత పేద విద్యార్థులను గుర్తించి ప్రవేశాలు కల్పించామన్నారు.
ప్రభుత్వం అందించే యూనిఫామ్కు అదనంగా నారాయణ విద్యాసంస్థల ద్వారా మరో నాలుగు
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ