కడప టీడీపీలో ‘కాపు’ జ్వాల
కడప,23 జూన్ (హి.స.)టీడీపీ ఆవిర్భావం నుంచి బలమైన మద్దతుదారులుగా కాపు కాసిన బలిజలు ఇప్పుడు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. అప్పట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డిలు 20 ఏళ్ల పాటు హవా కొనసాగిస్తూ వచ్చినా, కాపు నేతలు మాత్రం తెలుగుదేశం జ
కడప టీడీపీలో ‘కాపు’ జ్వాల


కడప,23 జూన్ (హి.స.)టీడీపీ ఆవిర్భావం నుంచి బలమైన మద్దతుదారులుగా కాపు కాసిన బలిజలు ఇప్పుడు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. అప్పట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డిలు 20 ఏళ్ల పాటు హవా కొనసాగిస్తూ వచ్చినా, కాపు నేతలు మాత్రం తెలుగుదేశం జెండానే మోశారు. ఒకరిద్దరు నేతలు పార్టీ మారిన తిరిగి మళ్లీ తిరిగొచ్చారు. అయినా, ప్రాధాన్యం దక్కకపోవడంపై ఆ సామాజిక నాయకుల్లో అసంతృప్తి నెలకొని ఉంది. రాజంపేట అభ్యర్థిగా గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన సుగవాసి బాలసుబ్రమణ్యం ఏడాది తిరక్కముందే ఇటీవల పార్టీకి రాజీనామా చేయడం కాపు వర్గాల్లో మరింత దుమారం రేపుతోంది.

ఉమ్మడి కడప జిల్లాలో సుదీర్ఘ రాజకీయ కుటుంబాల్లో ఒకటైన పాలకొండ్రాయుడు, ఆయన తనయుడు రాజీనామాతో బలిజ సామాజిక వర్గంలో టీడీపీ పై అసంతృప్తి నెలకొంది. 2024 ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో సుబ్రమణ్యంకు రాజంపేట పార్లమెంట్ టిక్కెట్టు ప్రకటించారు. ఆ తర్వాత కూటమి కలయికతో ఆ టిక్కెట్టు బీజేపీకి కేటాయించారు. సుబ్రహ్మణ్యంకు అసెంబ్లీ టికెట్ ఖరారు చేశారు. ఆయన అక్కడ గట్టిగా తలపడినప్పటికీ ఓటమి పాలయ్యారు. కాగా, రాజంపేట అసెంబ్లీ ఇన్‌చార్జి బాధ్యతలను సుబ్రహ్మణ్యంకు అప్పగిస్తారని భావించినా, పార్లమెంట్ అధ్యక్షుడు జగన్మోహన్ రాజుకు ప్రాధాన్యమిచ్చారు. ఈ విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని సుబ్రమణ్యం పై ఆయన వర్గీయులు ఒత్తిడి తెచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande