తెలంగాణ,జయశంకర్ భూపాలపల్లి 23 జూన్ (హి.స.)
జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం లక్ష్మారెడ్డి పల్లి గ్రామంలో సోమవారం విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఓద్దుల రాం రెడ్డి (46) తన పొలంలో ట్రాక్టర్ కల్టివేటర్ కొడుతుండగా… ట్రాక్టర్ అదుపుతప్పి తలకిందులుగా బోల్తా పడింది. ట్రాక్టర్ మీద పడడంతో రాంరెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు