తెలంగాణ, నిజామాబాద్. 23 జూన్ (హి.స.)
రైతుల చిరకాల స్వప్నమైన జాతీయ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయ ప్రారంభోత్సవానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈనెల 29న నిజామాబాద్ జిల్లాకు రానున్నట్లు ఎంపీ ధర్మపురి అరవింద్ తెలిపారు. పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో నిర్వహించే రైతు సమ్మేళన కార్యక్రమంలో రైతులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. సోమవారం జిల్లా కేంద్రంలోని బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణతో కలిసి ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడారు.రైతుల భవిష్యత్తుని తీర్చిదిద్దేందుకు పునాది అని ఎంపీ తెలిపారు. .
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు