తెలంగాణ, ఆదిలాబాద్.23 జూన్ (హి.స.)
దేశం కోసం శ్యామప్రసాద్ ముఖర్జీ చేసిన త్యాగం మరువలేనిదని భారతీయ జనతా పార్టీ ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యులు గొడం నగేష్, బీజేపీ పార్టీ నిర్మల్ జిల్లా అధ్యక్షులు రాథోడ్ రితేష్ పేర్కొన్నారు. సోమవారం ఉట్నూర్ పట్టణంలోని భారతీయ జనతా పార్టీ శాఖ ఆధ్వర్యంలో శ్రీ పులాజి బాబా కళాశాలలో జన సంఘ్ వ్యవస్థాపకులు శ్యామప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివాస్ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.ఈసందర్భంగా పార్లమెంటు సభ్యులు గొడం నగేష్, రితేష్ రాథోడ్ మాట్లాడుతూ… ఏక్ దేశ్ మే దో విధాన్, దో ప్రధాన్ ఔర్ దో నిషాన్ నహీ ఛాలెంగే అనే నినాదంతో జన సంఘ్ వ్యవస్థాపకుడు శ్యామప్రసాద్ దేశం కోసం ప్రాణాలర్పించారని గుర్తుచేశారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు