మేడ్చల్ జిల్లా పోచారంలో హైడ్రా కూల్చివేత‌లు..
తెలంగాణ, మేడ్చల్. 23 జూన్ (హి.స.) ప్రభుత్వ భూములతో పాటు ప్రైవేటు భూముల ఆక్రమణదారులపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా తాజాగా పోచారం మున్సిపాలిటీలో కూల్చివేతలు చేపట్టింది. తప్పుడు పత్రాలతో భూమిని ఆక్రమించి ఏడు ఎకరాల చుట్టూ నిర్మించిన ప్రహరీని ఈరోజు ఉ
హైడ్రా


తెలంగాణ, మేడ్చల్. 23 జూన్ (హి.స.) ప్రభుత్వ భూములతో పాటు ప్రైవేటు భూముల ఆక్రమణదారులపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా తాజాగా పోచారం మున్సిపాలిటీలో కూల్చివేతలు చేపట్టింది. తప్పుడు పత్రాలతో భూమిని ఆక్రమించి ఏడు ఎకరాల చుట్టూ నిర్మించిన ప్రహరీని ఈరోజు ఉదయం కూల్చివేసింది. ఇటీవల దివ్యానగర్ లో భారీ ప్రహరీని కూల్చివేసిన హైడ్రా అధికారులు ఈ రోజు ఏకశిలా నగర్ లో ఆక్రమణలను తొలగించారు.కొర్రెముల ఏకశిలా నగర్ లో సర్వే నెంబర్ 740, 741, 742 లలో 7.16 ఎకరాల భూమి తనదేనంటూ నూనె వెంకటనారాయణ అనే వ్యక్తి ప్రహరీ నిర్మించాడు.

దీంతో హైడ్రా బృందం ఏకశిల వెంచర్లో 7 ఎకరాల చుట్టూ నిర్మించిన ప్రహరీని కూల్చివేసింది.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande