తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శిలాతోరణం వరకు క్యూ
తిరుమల, 22 జూన్ (హి.స.)తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanam)లో వరుసగా ఐదో ఆదివారం కూడా భక్తుల రద్దీ (Crowd of devotees) కొనసాగుతోంది. వేసవి సెలవులు ముగిసినప్పటికీ.. ఇప్పుడిప్పుడు పాఠశాలలు ప్రారంభం అవుతుండటంతో.. తమ పిల్లలతో కలిసి శ్
తిరుమల శ్రీవారి దర్శనానికి 12 గంటలు


తిరుమల, 22 జూన్ (హి.స.)తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanam)లో వరుసగా ఐదో ఆదివారం కూడా భక్తుల రద్దీ (Crowd of devotees) కొనసాగుతోంది. వేసవి సెలవులు ముగిసినప్పటికీ.. ఇప్పుడిప్పుడు పాఠశాలలు ప్రారంభం అవుతుండటంతో.. తమ పిల్లలతో కలిసి శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు వేల సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు. దీంతో గత నెల రోజులుగా తిరుమల కొండపై భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. తాజాగా ఈ రోజు ఆదివారం కావడంతో భక్తుల రద్ధీ మరోసారి భారీగా పెరిగిపోయింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande