అమరావతి, 23 జూన్ (హి.స.)
నేడు (జూన్ 23)న ఉదయం 10 గంటలకు అంగప్రదక్షణ టికెట్లు విడుదల చేయనున్నారు. ఆ తర్వాత ఉదయం 11 గంటలకు స్వామి వారి శ్రీవాణి దర్శన టికెట్లు విడుదల చేయనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, వికలాంగుల దర్శన టిక్కెట్లను కూడా విడుదల చేయనుంది. అయితే మంగళవారం (జూన్ 24)న ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల చేయనుంది టీటీడీ. కాబట్టి ఎవరైనా భక్తులు స్వామివారిని దర్శించుకోవాలనుకున్నవారు ముందుగా ప్లాన్ చేసుకొని ఆన్లైన్ ద్వారా టికెట్స్ ను పొందవచ్చు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ