ఏసీబీ వలలో చిక్కిన పంచాయతీ సెక్రెటరీ..
తెలంగాణ, నిర్మల్. 24 జూన్ (హి.స.) నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలం గోడిసిర్యాల గ్రామ పంచాయతీ కార్యదర్శి శివకృష్ణ రూ.12 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా చిక్కారు. తన ఇంటి పక్క షెడ్డులో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు అనుమతి కో
ఏసిబి


తెలంగాణ, నిర్మల్. 24 జూన్ (హి.స.)

నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలం గోడిసిర్యాల గ్రామ పంచాయతీ కార్యదర్శి శివకృష్ణ రూ.12 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా చిక్కారు. తన ఇంటి పక్క షెడ్డులో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు అనుమతి కోరుతూ గ్రామ పంచాయతీకి అదే గ్రామానికి చెందిన ఓ రైతు దరఖాస్తు చేసుకున్నాడు. వాటర్ ప్లాంట్ అనుమతి కోసం కొన్ని నెలలుగా పంచాయతీ సెక్రెటరీ చుట్టూ తిరిగినా అనుమతి లభించలేదు. రూ.15వేలు లంచం ఇస్తేనే పనిచేసి పెడతానని సెక్రటరీ శివకృష్ణ తెగేసి చెప్పడంతో బాధితుడు పథకం ప్రకారం ఏసీబీని ఆశ్రయించారు. ఒప్పందం మేరకు రూ.12 వేలు ముందుగా లంచం తీసుకుంటుండగా మంగళవారం ఏసీబీ డీఎస్పీ మధు వలపన్ని పట్టుకున్నారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande