హైదరాబాద్, 24 జూన్ (హి.స.)
కాంగ్రెస్ రైతు పండుగ సంబురాలపై మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ రైతు పండగ సంబరాలు ఎందుకోసం? రైతు భరోసా నాలుగు విడతలు ఎగ్గొట్టినందుకా? అని నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ కంటే ఎక్కువ ఇస్తాం.. ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని చెప్పి రూ.12 వేలకు కుదించి.. అది కూడా ఇవ్వనందుకా? అని నిలదీశారు.
రూ.2 లక్షలు రుణమాఫీ అని చెప్పి అరకొర చేసి ఎగ్గొట్టినందుకా? ఏ కారణం చేత రైతు మరణించినా ఆ కుటుంబానికి ధీమాగా ఉండాలని రూ.5 లక్షల సాయం అందించే రైతుబీమా రాకుండా చేసినందుకా? ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో దాదాపు 550 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నందుకా? అని ప్రశ్నించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్