అమరావతి, 24 జూన్ (హి.స.)
: విజయవాడ నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. ఏపీఐఐసీ కాలనీలోని జమాక్ అపార్ట్మెంట్కి తాగునీరు అందించాలని తెదేపా సభ్యులు నిరసన తెలియజేశారు. ఆ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నవారు తెదేపాకి అనుకూలంగా ఉన్నారనే ఉద్దేశంతో వైకాపా అధికారపక్షం వారికి తాగునీరు అందించడం లేదని తెదేపా సభ్యులు ఆరోపించారు. నగర ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడంలో వైకాపా పాలక పక్షం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. ఈ క్రమంలో ఇరు పక్షాల మధ్య వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి.
అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్లు మంజూరు చేసే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని విపక్ష సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు. నగరంలో పచ్చదనం పెంపొందించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. భవిష్యత్తులో వీఎంసీ పరిధిలో ఖాళీగా ఉన్న పారిశుధ్య సిబ్బంది పోస్టులు భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని మేయర్ రాయన భాగ్యలక్ష్మి పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ