అమరావతి, 24 జూన్ (హి.స.)
గుంటూరు, మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ( మరో కేసు నమోదు అయ్యింది. జగన్ మిర్చి యార్డ్ పర్యటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే ఈ వ్యవహారానికి సంబంధించి వైసీపీ కీలక నేతలకు నల్లపాడు పోలీసులు నోటీసులు ఇస్తున్నారు. గత ఫిబ్రవరి 19న మిర్చి రైతుల పరామర్శ కోసం యార్డ్కు వెళ్లారు జగన్. కానీ అనుమతి లేకుండా యార్డ్లోకి వచ్చి వైసీపీ నేతలు నానా హంగామా సృష్టించారు. దీంతో జగన్తో పాటు పలువురు వైసీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఫ్యాన్ పార్టీ నేతలకు 41 ఏ నోటీసులు అందజేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ