తెలంగాణ, నిర్మల్. 24 జూన్ (హి.స.)
పర్యావరణ పరిరక్షణకు అమ్మ పేరుతో
ప్రతి ఒక్కరూ మొక్కలను నాటాలని ముధోల్ అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. మంగళవారం భైంసాలోని ఎస్ఎస్ జిన్నింగ్ ఫ్యాక్టరీలో శ్యామ్ ప్రసాద్ బలిదాన్ దివస్ కార్యక్రమాల సందర్భంగా మండల బీజేపీ ఆధ్వర్యంలో తులసి మొక్కల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ ప్రజలందరికి ఒకే దేశం ఒకే చట్టం ఉండాలన్న ఉద్దేశంతో భారతీయ జన సంఘ్ ను స్థాపించిన ఘనత శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ దేనన్నారు.
నేడు భారతీయ జనతా పార్టీ ఆయన ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటూ 370 ఆర్టికల్ రద్దు చేయడం జరిగిందన్నారు. ప్రధానమంత్రి మోదీ 11 సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా పలు కార్యక్రమాలు చేపట్టారన్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు