బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్.. నలుగురు నిందితుల అరెస్ట్
హైదరాబాద్, 24 జూన్ (హి.స.) టెలిగ్రామ్ ఛానల్స్ ద్వారా క్రికెట్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న నలుగురు నిందితుల అరెస్ట్ చేశారు సైబరాబాద్ సైబర్ క్రైమ్స్ పోలీసులు. ఇందుకు సంబంధించిన వివరాలను సైబరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ సాయిశ్రీ మంగళవారం వెల్లడించా
బెట్టింగ్ యాప్స్


హైదరాబాద్, 24 జూన్ (హి.స.)

టెలిగ్రామ్ ఛానల్స్ ద్వారా క్రికెట్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న నలుగురు నిందితుల అరెస్ట్ చేశారు సైబరాబాద్ సైబర్ క్రైమ్స్ పోలీసులు. ఇందుకు సంబంధించిన వివరాలను సైబరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ సాయిశ్రీ మంగళవారం వెల్లడించారు. ఈనెల 13న మియాపూర్ కు చెందిన స్టూడెంట్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు టెలిగ్రామ్ ఛానళ్ల పై దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా చిన్నం శెట్టి నాగ రాకేష్, పొత్తవాతిని దీపక్, గుగులోత్ శ్రీరామ్ నాయక్, హేమంత్ కుమార్ లను అదుపులోకి తీసుకున్నారు. వీరంతా ఉన్నత చదువులు చదువుకుని ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే వీరు సోషల్ మీడియాలో యాక్టివ్ గా వ్యవహరిస్తున్నారు. వీరికి టెలిగ్రాం ఛానల్ లో వేల సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు. ఇదే అదనుగా వీరు బెట్టింగ్ యాప్ లపై దృష్టి పెట్టారు. ఆన్ లైన్ ద్వారా క్రికెట్ బెట్టింగ్ లను ప్రోత్సహించే పనిలో పడ్డారు. స్టాకెడ్ డాట్ కామ్, లోటస్ ప్లే 24x7 డాట్ కామ్, రాయల్ బుక్ 365 డాట్ కామ్, అల్ట్రా విన్ డాట్ గేమ్స్ ద్వారా క్రికెట్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ తెలుగు రాష్ట్రాల ప్రజలను ఇన్ఫ్లూయెన్స్ చేస్తూ ప్రజలను, అమాయకులను తప్పుదారి పట్టిస్తున్నారని అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande