హైదరాబాద్, 24 జూన్ (హి.స.)
మంత్రుల తీరుపై సీఎం రేవంత్రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల బాధ్యత అంతా ఇంఛార్జ్ మంత్రులదే అని సీఎం స్పష్టం చేశారు.
మంగళవారం హైదరాబాద్ గాంధీ భవన్లో ఆయన మాట్లాడారు. నిధులు, బాధ్యతలు అన్నీ మీదగ్గరే ఉన్నాయి. జిల్లాలపై ఇంఛార్జ్ మంత్రులు దృష్టిపెట్టడం లేదు. ఇది సరైంది కాదు. నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయండి అంటే ఎందుకు పట్టించుకోవడం లేదు. వెంటనే జిల్లాల్లో పదవులు భర్తీ చేయండి. అని సీఎం పేర్కొన్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై ఫోకస్ పెట్టినట్లు సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. అభ్యర్థి ఎవరనేది అధిష్టానం ప్రకటిస్తుందని.. ఎవరికి వారు... నేనే అభ్యర్థిని చెప్పుకోకండన్నారు. పార్టీ క్రమశిక్షణ రాహిత్యంగా చూడాల్సి వస్తుందని.. పార్టీలో క్రమశిక్షణ ముఖ్యమన్నారు. మంత్రి పదవులు కోసం ధర్నాలు చేయించడం ఏంటి? అని ప్రశ్నించారు. పదవులు అడగడం తప్పు లేదు.. కానీ ఇవాళ ఒకరు ధర్నా చేశారు అని... రేపు ఇంకొకరు చేస్తారు అని తెలిపారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..