తెలంగాణ, మేడ్చల్. 24 జూన్ (హి.స.)
మేడ్చల్ పట్టణంలోని వ్యాపారస్తులు, గృహ నిర్మాణ దారులు రోడ్లపైకి నిర్మాణాలు గాని, షాపులు నిర్మించినట్లయితే వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని టౌన్ ప్లానింగ్ అధికారి రాధాకృష్ణ రెడ్డి అన్నారు. మేడ్చల్ పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీ గల రోడ్డు పై నిర్మించుకున్న చిరువ్యాపారుల షాపులు, ఇంటి నిర్మాణం ముందు ఏర్పాటు చేసుకున్న షెడ్లను మంగళవారం జెసీబీల సహాయంతో మున్సిపాలిటీ కమిషన్ బి. నాగిరెడ్డి ఆదేశాల మేరకు అధికారులు కూల్చి వేశారు.
ఈ సందర్భంగా టౌన్ ప్లానింగ్ అధికారి రాధాకృష్ణారెడ్డి మాట్లాడుతూ మేడ్చల్ మున్సిపల్ పరిధిలో గల వ్యాపారస్తులు, ఇంటి నిర్మాణ దారులు రోడ్లపైకి వచ్చేలా నిర్మాణాలు, షాపులు పెట్టవద్దని తెలిపారు. అలా నిర్మాణాలు జరిపితే అక్రమ నిర్మాణాలను కూల్చి వేస్తామన్నారు. ఎవరైనా రోడ్ల పై షాపులు నిర్మించుకుంటే రోడ్ల పై కాకుండా వేరే చోటుకు మర్లించుకోవాలని సూచించారు. మున్సిపల్ అధికారుల ఆదేశాలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు