రైస్ మిల్లులో భారీ స్కాం: అర్ధరాత్రి టాస్క్ ఫోర్స్ దాడులు..
జగిత్యాల, 24 జూన్ (హి.స.) జగిత్యాల జిల్లా రఘురాముల కోట గ్రామ శివారులో ఉన్న ఓ రైసెమిల్లుపై సోమవారం అర్ధరాత్రి టాస్క్ ఫోర్స్ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భారీగా రేషన్ బియ్యం రీసైక్లింగ్ జరుగుతున్నట్లు గుర్తించారు. పెద్ద మొత
జగిత్యాల రైస్ మిల్


జగిత్యాల, 24 జూన్ (హి.స.)

జగిత్యాల జిల్లా రఘురాముల కోట గ్రామ శివారులో ఉన్న ఓ రైసెమిల్లుపై సోమవారం అర్ధరాత్రి టాస్క్ ఫోర్స్ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భారీగా రేషన్ బియ్యం రీసైక్లింగ్ జరుగుతున్నట్లు గుర్తించారు.

పెద్ద మొత్తంలో రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తూ కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ ధాన్యాన్ని పక్కదారి పట్టిస్తున్నాడనే పక్కా సమాచారం మేరకు స్టేట్ టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు చేశారు. అర్థరాత్రి ఒక ట్రక్కులో రేషన్ బియ్యం మిల్లుకు తరలిస్తుండగా, ఆ ట్రక్కును అనుసరించిన అధికారులు రైస్మిల్లును సీజ్ చేసినట్లు తెలుస్తోంది. మిల్లులో బియ్యం నిల్వలకు, ప్రభుత్వ ధాన్యం లెక్కలకు మధ్య భారీ వ్యత్యాసాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ స్కాం విలువ కోట్ల రూపాయల్లో ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. సీజ్ చేసిన రైస్ మిల్లుకు పోలీసు పహారా ఏర్పాటు చేశారు. మంగళవారం పూర్తిస్థాయిలో తనిఖీలు నిర్వహించి, రాత్రి వరకు వివరాలు వెల్లడించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande