కొండగట్టు అంజన్న ఆలయంలో భక్తుల రద్దీ
తెలంగాణ, జగిత్యాల. 24 జూన్ (హి.స.) జగిత్యాల జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి సన్నిధానంలో మంగళవారం భక్తుల రద్దీ నెలకొంది. మంగళవారం వేకువజామున నుండే ఆలయ నూతన పుష్కరిణి లో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారి దర్శనం కోసం భక్తుల
కొండగట్టు


తెలంగాణ, జగిత్యాల. 24 జూన్ (హి.స.)

జగిత్యాల జిల్లాలో ప్రముఖ

పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి సన్నిధానంలో మంగళవారం భక్తుల రద్దీ నెలకొంది. మంగళవారం వేకువజామున నుండే ఆలయ నూతన పుష్కరిణి లో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారి దర్శనం కోసం భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు.

భక్తుల రద్దీని గమనించిన ఆలయ ఈవో శ్రీకాంత్ రావు ఎప్పటికప్పుడు తమ సిబ్బందికి ఆదేశాలను జారీ చేస్తూ స్వామివారి దర్శనం ప్రశాంతంగా అయ్యేలా క్యూ లైన్లను క్రమబద్ధీకరించారు. మంగళవారం సుమారు 20,000 మంది ఆంజనేయ స్వామి వారిని దర్శించుకోగా ఆలయానికి వివిధ సేవలు పూజలు టికెట్ల రూపంలో ఆలయానికి 10 లక్షల రూపాయల ఆదాయం సమకూరనున్నట్లు ఆలయ అధికార వర్గాలు వెల్లడించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande