తెలంగాణ,జగిత్యాల.24 జూన్ (హి.స.)
విద్యార్థుల బస్ పాస్ చార్జీల పెంపును ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పేర్కొన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆర్టీసీ ఉన్నతాధికారులతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థుల బస్ చార్జీల పెంపుపై పునరాలోచన చేయాలని అన్నారు. చార్జీల పెంపుతో విద్యార్థులు వారి తల్లిదండ్రులపై ఆర్థిక భారం పడుతుందన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులపై ఛార్జీల పెంపు ప్రభావం చూపుతుందన్నారు.
బస్సు చార్జీల పెంపుపై విద్యార్థుల ఆందోళనను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం పెంచిన చార్జీలను ఉపసంహరించుకోవాలన్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు