అమరావతి, 24 జూన్ (హి.స.)
అమరావతి: రాజధాని అమరావతిలో మౌలిక వసతుల కోసం మరోసారి భూసమీకరణ చేయాలని కేబినెట్ నిర్ణయించిందని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఒకేరకమైన రూల్స్తో ల్యాండ్ పూలింగ్ చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఏపీ మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి మీడియాకు వివరించారు.
‘‘ ప్రజలకు ఇబ్బంది లేకుండా నిబంధనలు సవరించాం.ఎన్జీటీ, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం జలవనరులను రక్షిస్తాం. అసైన్డ్, దేవాదాయ, లంక భూములపై జేసీతో దర్యాప్తు చేయిస్తాం. సర్వే సమయంలో సరిహద్దుల వద్ద సమస్యలు రాకుండా చూస్తాం. స్థానిక రైతులకు ఉచిత విద్య, వైద్య చికిత్స అందిస్తాం. గతంలో పునాదులు పూర్తయిన భవనాలు తొలుత పూర్తి చేస్తాం. టెండర్లు దక్కించుకున్న జీఏడీ, హెచ్వోడీ టవర్లను ఎన్సీసీ, ఎల్ అండ్ టీ, షాపూర్ పల్లోంజీ సంస్థకు అప్పగిస్తాం. సీఆర్డీఏ సమావేశ నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది’’ అని
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ