తెలంగాణ, రంగారెడ్డి. 24 జూన్ (హి.స.)
ప్రజా సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా
పనిచేస్తున్నామని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శంభీపూర్ రాజు అన్నారు. దుండిగల్ మున్సిపాలిటీ పరిధి శంభీపూర్ లోని ఆయన కార్యాలయంలో మంగళవారం నియోజకవర్గానికి చెందిన పలువురు జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు, తాజా మాజీ ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ కాలనీల సభ్యులు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజును మర్యాదపూర్వకంగా కలిసారు.
ఈ సందర్భంగా తమ ప్రాంతాలలో నెలకొన్న పలు సమస్యలు తెలపడంతో పాటు వాటిని పరిష్కరించాలని విన్నవించారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్సీ రాజు ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కారమయ్యేలా చూస్తాననని హామీనిచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు