తెలంగాణ, పెద్దపల్లి. 24 జూన్ (హి.స.)
భూ భారతి రెవెన్యూ సదస్సుల కింద వచ్చిన దరఖాస్తులను ఆగస్టు 15వరకు పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్య కార్యదర్శి కే రామ కృష్ణా రావు అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలపై మంగళవారం హైదరాబాద్ నుంచి సీఎస్ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. పెద్దపల్లి కలెక్టరేట్ నుంచి కలెక్టర్ కోయ శ్రీ హర్ష అదనపు కలెక్టర్లు అరుణ శ్రీ వేణు కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు.
వన మహోత్సవం, ఇందిరమ్మ ఇండ్ల, ఎరువుల లభ్యత, ఆయిల్ పామ్ సాగు, సీజనల్ వ్యాధుల నియంత్రణ, భూ భారతి దరఖాస్తుల పరిష్కారం వంటి పలు అంశాలపై సీఎస్ జిల్లా అధికారులకు సూచనలు చేశారు. అటవీ ప్రాంతంలో కోతులకు అవసరమైన పండ్ల మొక్కలను పెద్ద ఎత్తున బ్లాక్ ప్లాంటేషన్ పెంచాలన్నారు.జిల్లాలకు కేటాయించిన వన మహోత్సవం టార్గెట్ను సకాలంలో పూర్తి చేయాలని సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు