హైదరాబాద్, 24 జూన్ (హి.స.)
పార్టీ మరియు ప్రభుత్వం జోడేదుల్లా పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. మంగళవారం పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయంతో ముందుకు తీసుకెళ్తామని అన్నారు. 18 నెలల ప్రభుత్వపాలన గోల్డెన్ పీరియడ్ అని చెప్పారు. బూత్, గ్రామ, మండల స్థాయిలో పార్టీ కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. బూత్ స్థాయిలో పార్టీ బలంగా ఉంటే ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లగలుగుతామని అభిప్రాయపడ్డారు. పార్టీ నిర్మాణంపై పీసీసీ దృష్టి సారించాలని అన్నారు. మరోసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేలా అంతా కలిసి ఐకమత్యంగా పనిచేయాలని కోరారు. పార్టీ కమిటీల్లో ఉన్న నాయకులు గ్రౌండ్ లెవెల్లో పని చేయాలని ఆదేశించారు. పని చేస్తేనే పదవులు వస్తాయని అన్నారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..