హైదరాబాద్, 24 జూన్ (హి.స.)
కుటుంబ కలహాలతో తల్లి,ఇద్దరు పిల్లలు కనపడకుండా పోయిన ఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శేరిలింగంపల్లి ఆదర్శనగర్కు చెందిన ముల్క ప్రశాంత్ తన భార్య రజిత (32) తన కుమార్తె జ్యోతిక (10), కుమారుడు సుందర్ (8)తో కలిసి నివాసం ఉంటున్నారు. ప్రశాంత్ ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తుండగా, రజిత ఓ సూపర్ మార్కెట్ లో క్యాషియర్ గా పనిచేస్తుంది. ఇటీవల తరచూ వారి మధ్య కుటుంబ కలహాలు చోటుచేసుకుంటున్నాయి.
ఈ నేపథ్యంలో సోమవారం భర్త ప్రశాంత్ పనికి వెళ్లగా పిల్లలు ఇద్దరు స్కూల్ కు వెళ్లారు. మధ్యాహ్నం విధులకు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరిన రజిత, పాఠశాలలో ఉన్న తన ఇద్దరు పిల్లలను కూడా వెంట తీసుకువెళ్లారు. సాయంత్రం భర్త ప్రశాంత్ ఫోన్ చేయగా ఆమె స్పందించలేదు. డ్యూటీ నుంచి ఇంటికి తిరిగి వచ్చిన ప్రశాంత్ కు భార్య పిల్లలు కనబడక పోవడంతో చుట్టుపక్కల వారిని, బంధువుల వద్ద ఆరా తీశాడు. అయినా వారి ఆచూకీ తెలియకపోవడంతో చందానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రశాంత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్