హైదరాబాద్, 24 జూన్ (హి.స.)
సీఎం చంద్రబాబు అధ్యక్షతన
వెలగపూడిలోని సచివాలయంలో కేబినెట్ సమావేశం నేటి ఉదయం ప్రారంభమైంది. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు. అయితే సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే పవన్ కళ్యాణ్ తల్లి అంజనా దేవి అస్వస్థతకు గురైందంటూ కుటుంబ సభ్యుల నుంచి ఫోన్ కాల్ వచ్చింది. దీంతో పవన్, సీఎం చంద్రబాబుకు సమాచారం ఇచ్చి హుటాహుటిన కేబినెట్ సమావేశం జరగుతుండగానే హైదరాబాదు కు బయలుదేరారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తల్లి అంజనా దేవి ఈరోజు ఉదయం అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆమెను హైదరాబాద్లోని ఓ ప్రముఖ ఆస్పత్రికి తరలించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్