తెలంగాణ, 24 జూన్ (హి.స.)అక్రమనిర్మాణాల పై హైడ్రా అధికారులు కొరడా ఝలిపించారు. దుండిగల్ మున్సిపాలిటీ మల్లంపేటలో హైరైజ్ నిర్మాణదారుడు 10 సంవత్సరాల క్రితం రోడ్డును ఆక్రమించి విల్లాలు నిర్మించడంతో అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. పలుమార్లు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా సమస్యను గాలికి వదిలేశారు. విసుగెత్తిన స్థానికులు హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేయడంతో స్పందించిన అధికారులు మంగళవారం రోడ్డు అడ్డంగా నిర్మించిన ప్రహారీగోడను మున్సిపల్ సిబ్బందితో కలసి కూల్చివేశారు. మల్లంపేట కేవీఆర్ వెంచర్లో రోడ్డును ఆక్రమించి అక్రమనిర్మాణాలు చేపట్టడంతో ఫిర్యాదుల ఆధారంగా అధికారులు కూల్చివేశారు. స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు