హైదరాబాద్, 24 జూన్ (హి.స.) ప్రేమవ్యవహారంలో తల్లి మందలించడంతో 10 తరగతి చదువుతున్న విద్యార్థిని తల్లిని కడతేర్చింది. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి న్యూ ఎల్ బి నగర్ లో ఉంటున్న అంజలి (39) పదో తరగతి చదువుతున్న తన కూతురిని ప్రేమ విషయంలో మందలించింది. ఇది మనసులో పెట్టుకున్న అంజలి కూతురు, ఆమె ప్రియుడు (18), అతని తమ్ముడు (18)తో కలిసి సోమవారం అర్థరాత్రి అంజలి గొంతు నులిమి, తలపై కొట్టి హత్య చేశారు.
సోమవారం సాయంత్రం నల్గొండ నుంచి వచ్చిన ప్రియుడు శివ, తేజశ్రీ ఇంటికి వెళ్లి పూజ చేస్తున్న అంజలిపై వెనుక నుంచి దాడి చేశాడు. అనంతరం బెడ్ షీట్ తో అంజలి ముఖాన్ని కప్పగా.. కుమార్తె తేజశ్రీ ఆమె తలపై సుత్తితో బలంగా బాదింది. అంజలి ప్రాణం పోకపోవడంతో ఆమె పీకను శివ తమ్ముడు యశ్వంత్ కిరాతకంగా కత్తితో కోసేశాడు. స్థానికుల ఫిర్యాదుతో జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్