హైదరాబాద్, 24 జూన్ (హి.స.)
తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. మునిసిపాలిటీల్లో పాలనాపరమైన మార్పులకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 129 మంది మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ.. కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఇవాళ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన వారిలో కొందరు పదోన్నతులు పొందగా.. మరికొందరు వారి పనితీరు బాగోలేక ట్రాన్స్ఫర్ అయినట్లుగా తెలుస్తోంది. మున్సిపల్ కమిషనర్ల బదిలీలకు సంబంధించి పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్