అమరావతి, 25 జూన్ (హి.స.)
తాడేపల్లి, పట్టాభిపురం దళితుడు చీలి సింగయ్య మృతికి కారణమైన మాజీ సీఎం జగన్ ఫార్చూనర్ వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 18న పల్నాడుజిల్లా పర్యటనలో జగన్ ప్రయాణించిన వాహనం కింద పడి వైకాపా కార్యకర్త సింగయ్య మృతించెదిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఏ1గా డ్రైవర్ రమణారెడ్డి, ఏ2గా జగన్తోపాటు ఆయన పీఏ నాగేశ్వరరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, మాజీమంత్రులు పేర్ని నాని, విడదల రజిని నిందితులుగా ఉన్నారు. పోలీసులు ఈ కేసు దర్యాప్తు వేగవంతం చేశారు. జగన్ వాహనాన్ని స్వాధీనం చేసుకునేందుకు మంగళవారం సాయంత్రం ప్రత్తిపాడు సీఐ శ్రీనివాసరావు తాడేపల్లి సీఐ వీరేంద్రబాబు, నల్లపాడు ఎస్ఐ తాడేపల్లిలోని ఆయన నివాసానికి వెళ్లారు. ఇద్దరు వీఆర్వోల సమక్షంలో పంచనామా చేసి ఆ పత్రాన్ని వైకాపా కార్యాలయ కార్యదర్శి, ఎమ్మెల్సీ అప్పిరెడ్డికి అందించి ఏపీ 40 డీహెచ్ 2349 ఫార్చూనర్ వాహనాన్ని స్వాధీనం చేసుకుని గుంటూరులోని నల్లపాడు పోలీసుస్టేషన్కు తరలించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ