దళితుడు సింగయ్య మృతికి కారణమైన మాజీ సీఎం.జగన్ వాహనం పోలీసులున్స్వదినం చేసుకున్నారు
అమరావతి, 25 జూన్ (హి.స.) తాడేపల్లి, పట్టాభిపురం దళితుడు చీలి సింగయ్య మృతికి కారణమైన మాజీ సీఎం జగన్‌ ఫార్చూనర్‌ వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 18న పల్నాడుజిల్లా పర్యటనలో జగన్‌ ప్రయాణించిన వాహనం కింద పడి వైకాపా కార్యకర్త సింగయ్య మృతిం
దళితుడు సింగయ్య మృతికి కారణమైన మాజీ సీఎం.జగన్ వాహనం పోలీసులున్స్వదినం చేసుకున్నారు


అమరావతి, 25 జూన్ (హి.స.)

తాడేపల్లి, పట్టాభిపురం దళితుడు చీలి సింగయ్య మృతికి కారణమైన మాజీ సీఎం జగన్‌ ఫార్చూనర్‌ వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 18న పల్నాడుజిల్లా పర్యటనలో జగన్‌ ప్రయాణించిన వాహనం కింద పడి వైకాపా కార్యకర్త సింగయ్య మృతించెదిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఏ1గా డ్రైవర్‌ రమణారెడ్డి, ఏ2గా జగన్‌తోపాటు ఆయన పీఏ నాగేశ్వరరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, మాజీమంత్రులు పేర్ని నాని, విడదల రజిని నిందితులుగా ఉన్నారు. పోలీసులు ఈ కేసు దర్యాప్తు వేగవంతం చేశారు. జగన్‌ వాహనాన్ని స్వాధీనం చేసుకునేందుకు మంగళవారం సాయంత్రం ప్రత్తిపాడు సీఐ శ్రీనివాసరావు తాడేపల్లి సీఐ వీరేంద్రబాబు, నల్లపాడు ఎస్‌ఐ తాడేపల్లిలోని ఆయన నివాసానికి వెళ్లారు. ఇద్దరు వీఆర్వోల సమక్షంలో పంచనామా చేసి ఆ పత్రాన్ని వైకాపా కార్యాలయ కార్యదర్శి, ఎమ్మెల్సీ అప్పిరెడ్డికి అందించి ఏపీ 40 డీహెచ్‌ 2349 ఫార్చూనర్‌ వాహనాన్ని స్వాధీనం చేసుకుని గుంటూరులోని నల్లపాడు పోలీసుస్టేషన్‌కు తరలించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande