తెలంగాణ, 26 జూన్ (హి.స.)
బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్
ఆయన కుటుంబ సభ్యులు, ఇంటెలిజెన్స్, టాస్క్ ఫోర్స్ అంతా కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతల ఫోన్లను ట్యాపింగ్ చేయడమే పనిగా పెట్టుకున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబం కొంత మందిని టార్గెట్ గా పెట్టుకుని ఫోన్ ట్యాపింగ్ చేస్తూ దుర్మార్గం, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని దుయ్యబట్టారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, కవిత రాత్రి పూట ఫోన్ల వద్దే పడుకునేవారేమో.. అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నేరస్తుల ఫోన్లు ట్యాప్ చేయడం వేరు. కానీ ప్రజాస్వామ్య పరిధిలో రాజకీయ వ్యవహారాలు చేసే లీడర్ల ఫోన్లు ట్యాప్ చేయడం ఏంటని మండిపడ్డారు. ఇవాళ గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన జగ్గారెడ్డి.. గత ప్రభుత్వంలో తన ఫోన్ ట్యాప్ జరిగిందని వస్తున్న వార్తలపై స్పందించారు. తన ఫోన్ ట్యాప్ అవుతున్నట్లు గతంలో చాలా మంది పోలీసు అధికారులే నాతో చెప్పారని అన్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు