తెలంగాణ, ఆదిలాబాద్. 27 జూన్ (హి.స.)
కేసీఆర్ ప్రభుత్వంలో తన ఫోన్ కూడా ట్యాపింగ్ జరిగిందని, తల తిక్క పనులతోనే ప్రజలు ఆ ప్రభుత్వాన్ని తిరస్కరించారని, అందుకే కుప్పకూలిపోయిందని రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ఫోన్ ట్యాపింగ్ లు చేయడం ఆదర్శ పాలన ఎట్లా అవుతుందనీ ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు ఇతర అంశాల్లో కూడా కేసీఆర్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారన్నారు.
ఎన్నికలు ఏవైనా కాంగ్రెస్ పార్టీ అధిక స్థానాలను కైవసం చేసుకుంటుందనే పూర్తి విశ్వాసం ఉందనీ మంత్రి జూపల్లి అన్నారు. పరిపాలన ద్వారా ఉమ్మడి జిల్లాలో కచ్చితంగా మార్పులు తెస్తామన్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు