అమరావతి, 27 జూన్ (హి.స.)
చిత్తూరు (నేరవార్తలు), : రైల్వే సిగ్నల్ వ్యవస్థను ట్యాంపరింగ్ చేసి ఆగిన ఎక్స్ప్రెస్ రైలులో దోపిడీకి పాల్పడ్డారు. ఒకరిపై ఒకరు ఎక్కి కిటికీల వైపు టార్చ్ లైటు వేసి మహిళల మెడలోని బంగారు గొలుసులు తెంపారు. ప్రయాణికులు మేల్కోవడం.. రైల్వే పోలీసులు అప్రమత్తం అయ్యేలోగా దుండగులు అక్కడి నుంచి జారుకున్నారు.
చిత్తూరు రూరల్ మండలంలోని సిద్ధంపల్లి రైల్వే స్టేషన్కు కూతవేటు దూరంలో గురువారం వేకువజాము 2.30 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. 15 నుంచి 20 నిమిషాల వ్యవధిలోనే రెండు బోగీల్లో.. నలుగురి వద్ద బంగారం చోరీకి గురైంది. చామ్రాజ్ నగర్ ఎక్స్ప్రెస్(16219) రైలు బుధవారం అర్ధరాత్రి కాట్పాడిలో బయలుదేరి చిత్తూరు మీదుగా తిరుపతికి వెళ్లాలి. అలా వస్తుండగా సిద్ధంపల్లి రైల్వేస్టేషన్కు 350 మీటర్ల దూరంలోని పాయింట్ వద్ద గుర్తుతెలియని వ్యక్తులు సిగ్నల్ వ్యవస్థ పెట్టెలు తెరిచి ట్యాంపరింగ్ చేశారు. ఏ సిగ్నల్ ఇచ్చినా రెడ్లైట్ సిగ్నల్ వెలిగేలా చేశారు. ఆ సమయంలో సిద్ధంపల్లి రైల్వే స్టేషన్లో ఉన్న రైల్వే అధికారి.. గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. సిగ్నల్ వ్యవస్థ ట్యాంపరింగ్ కావడంతో 350 మీటర్ల దూరంలో రెడ్సిగ్నల్ లైట్ వెలుగుతుండటంతో వేగంగా వస్తున్న ఎక్స్ప్రెస్ రైలు ఆగిపోయింది. ఆ స్టేషన్లో క్రాసింగ్ ఉండటంతో ప్రయాణికులు మిన్నకున్నారు. అప్పటికే దుండగులు రైలు వెలుపల ఒకరు ఉంటే మరొకరు నిలబడిన వ్యక్తి భుజంపై కూర్చుని తెరచిన కిటికీల్లో టార్చ్ వేస్తూ ఓ మహిళ మెడలో బంగారం గొలుసు తెంపారు. ఇలా ఎస్-7 బోగీలో ఇద్దరి వద్ద, ఎస్-10 బోగీలో మరో ఇద్దరి వద్ద దోపిడీ చేశారు. ఇలా నలుగురి వద్ద 40 గ్రాములు, 15.5, 4, 5 గ్రాముల చొప్పున కాజేశారు. రైలులోని బీట్ అధికారులు తుపాకీలు చేబూని విజిల్ వేసే లోగా దొంగలు జారుకున్నారు. రైలు ఇంజిన్లో ఉన్న అధికారులు సంబంధిత స్టేషన్కు రెడ్సిగ్నల్కు కారణం అడగ్గా.. అలాంటిదేమీ లేదని, తాము గ్రీన్ సిగ్నల్ ఇచ్చామని చెప్పడంతో రైలు కదిలింది. (C
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ