హైదరాబాద్, 28 జూన్ (హి.స.)
, : ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం వేడివేడి భోజనాన్ని అందించేందుకు నగరంలో 150 ఇందిరమ్మ క్యాంటీన్లు రాబోతున్నాయి. శిథిలావస్థకు చేరుకున్న రూ.5 భోజన కేంద్రాలను తొలగించి.. వాటి స్థానంలో రూ.10.7 కోట్లతో కొత్తవి ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. 3 నెలల్లో వీటిని ప్రారంభిస్తామని కమిషనర్ కర్ణన్ తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ