అమరావతి, 28 జూన్ (హి.స.)
:ఏరోస్పేస్-డిఫెన్స్ రంగంలో విస్తృత అవకాశాలను అందిపుచ్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. రాష్ట్రా న్ని గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ అండ్ డిఫెన్స్ రిసెర్చ్ హబ్గా మార్చాలన్న నిర్ణయంతో ఈ రంగంలో విదేశీ పెట్టుబడులకు ఆహ్వానం పలుకుతూ ఏరోస్పేస్-డిఫెన్స్ పాలసీ 2025-30ని శుక్రవారం విడుదల చేసింది. రూ. లక్ష కో ట్లు పెట్టుబడుల సేకరణ.. లక్ష మందికి ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు స్పష్టం చేసింది. ఈ రంగంలో పెట్టే పెట్టుబడులపై 25 నుంచి 45 శాతం వరకూ రాయితీ ఇవ్వాలని, సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల జీతాల్లో నూ 10 శాతం భరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వివిధ విభాగాల్లో ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు రాష్ట్రాన్ని ఆరు క్లస్టర్లుగా విభజించింది. ఈ మేరకు రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్ ఉత్తర్వులు జారీ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ