హైదరాబాద్, 28 జూన్ (హి.స.) మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్డు వద్ద గల పీవీ ఘాట్ లో ఎంపీ ఈటల రాజేందర్ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు వారు మాట్లాడుతూ పీవీ మా హుజూరాబాద్ వాసి అని అంచలంచలుగా ఎదిగి దేశ ప్రధాని అయ్యారన్నారు. అప్పట్లో పీవీ గురించి కథలు కథలుగా చెప్పుకునే వారని తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట దళంలో పనిచేసిన వ్యక్తి ఆయన అన్నారు. ఆయన ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సర్వేలు లాంటి రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టి ఆణిముత్యాల్లాంటి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను తయారు చేశారని గుర్తు చేశారు. కేంద్రంలో హెన్ఆర్డీ మంత్రిగా ఉన్నప్పుడు నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేసింది కూడా పీవీనే అని విదేశీ విధానాన్ని ప్రపంచ చిత్రపటం మీద మహోన్నతంగా నిలబెట్టిన వ్యక్తి అని కొనియాడారు. దేశం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సమయంలో లిబరైజేషన్, గ్లోబలైజేషన్ తీసుకువచ్చి దేశ ఆర్థిక వ్యవస్థ దారిలో పెట్టారన్నారు. ఆయన జీవితం రాజకీయ వ్యవస్థకు, నాయకులకు గొప్ప సందేశం అని ఈటెల చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు