నెల్లూరు, 28 జూన్ (హి.స.)
: జిల్లా ఏఎస్ పేట ప్రభుత్వాస్పత్రిలో ఒప్పంద ఉద్యోగిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. నిద్రమాత్రలు మింగడంతో ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. మరో ఒప్పంద ఉద్యోగిని లక్ష్మి వేధింపుల వల్లే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు ఓ సెల్ఫీ వీడియో తీసుకొని నిద్రమాత్రలు తీసుకుంది. వైద్యుడు సురేశ్పై ఇటీవల లక్ష్మి కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాలతో సురేశ్పై డీఎంహెచ్వో సుజాత విచారణ జరిపారు. ఈ విచారణలో లక్ష్మికి వ్యతిరేకంగా దొరసానమ్మ వాంగ్మూలం ఇచ్చారు. ఈ క్రమంలోనే ఆమె వేధిస్తున్నారని దొరసానమ్మ ఆరోపిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ