హైదరాబాద్, 28 జూన్ (హి.స.)
తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖలో భారీగా బదిలీలు చోటు చేసుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 44 మంది డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) స్థాయి అధికారులను బదిలీ చేస్తూ డీజీపీ జితేందర్ శనివారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. పరిపాలనా సౌలభ్యం కోసం ఈ బదిలీలు చేపట్టారు.బదిలీల్లో భాగంగా పలువురు అధికారులకు కీలక పోస్టింగులు కేటాయించారు. బదిలీ అయిన వారిలో వై. నాగేశ్వరరావును సైబరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) ఏసీపీగా నియమించారు. అదేవిధంగా, ఆకుల చంద్రశేఖర్కు మహేశ్వరం ట్రాఫిక్ ఏసీపీగా, సంపత్కుమార్కు రాచకొండ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏసీపీగా బాధ్యతలు అప్పగించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలు, కమిషనరేట్ల పరిధిలో పనిచేస్తున్న డీఎస్పీలకు స్థానచలనం కల్పిస్తూ ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..