తెలంగాణ, జనగామ. 28 జూన్ (హి.స.) జనగామ కలెక్టర్ రిజ్వాన్ భాషా బండ్లగూడెం కస్తూర్బా పాఠశాలను శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల గదులను మరియు పరిసరాలను వారు పరిశీలించారు. పాఠశాలలోని పలు రికార్డులను కలెక్టర్ తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా సిబ్బంది ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పాఠశాల
విద్యార్థినులతో కలిసి భోజనం చేసి భోజనాన్ని పరిశీలించారు.
నాణ్యమైన మరియు పరిశుభ్రమైన ఆహారాన్ని విద్యార్థులకు అందించాలని సూచించారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు