పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా కేసీఆర్ నివాళులు
హైదరాబాద్, 28 జూన్ (హి.స.) భారత మాజీ ప్రధాని, భారతరత్న పీవీ నరసింహారావు 104వ జయంతి సందర్భంగా తెలంగాణ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.‘పీవీ మన తెలంగాణ ఠీవి.. భారతదేశ ఆణిముత్యం..’ అని అభివర్ణించారు. పీవీ స్ఫూర్తితో ప్రజా సంక్షేమ
కెసిఆర్


హైదరాబాద్, 28 జూన్ (హి.స.)

భారత మాజీ ప్రధాని, భారతరత్న పీవీ నరసింహారావు 104వ జయంతి సందర్భంగా తెలంగాణ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.‘పీవీ మన తెలంగాణ ఠీవి.. భారతదేశ ఆణిముత్యం..’ అని అభివర్ణించారు. పీవీ స్ఫూర్తితో ప్రజా సంక్షేమ పాలన కొనసాగించడమే వారికి మనం అర్పించే నివాళి అని పేర్కొన్నారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా ఆయన దేశాభ్యున్నతికి చేసిన కృషిని కేసీఆర్‌ స్మరించుకున్నారు. తెలంగాణ బిడ్డగా, పాలనాదక్షుడిగా, భారత ప్రధానిగా.. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థను గాడినపెట్టి, జాతి ఔన్నత్యాన్ని నిలబెట్టిన గొప్ప వ్యక్తి పీవీ అని ప్రశంసించారు. బహు భాషా కోవిదుడుగా, సాహితీవేత్తగా, రాజకీయ దురంధరుడుగా, దేశ ఆర్థిక సంస్కరణల పితామహుడిగా ప్రసిద్ధిగాంచిన తీరు అజరామరమని పేర్కొన్నారు

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande