తెలంగాణ, కోరుట్ల. 28 జూన్ (హి.స.)
దేశ భవిష్యత్తు నవతరం, యువతరం చేతుల్లోనే ఉందని, ఆడవాళ్లు మగవాళ్లు అనే బేధం లేకుండా ప్రతి ఒక్కరు తమ ప్రతిభను చాటుకొని ఉద్యోగాల్లో రాణించాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల పేర్కొన్నారు. శనివారం కోరుట్ల పట్టణంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా జాబ్ మేళాకు హాజరైన నిరుద్యోగ యువతను ఉద్దేశించి మాట్లాడుతూ..
తెలంగాణలో యువతరం గళం ఎత్తితేనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని పేర్కొన్నారు. కొత్త తరం తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు గడించేలా ముందుకు తీసుకెళ్లవలసిన అవసరం ఉందన్నారు. యువత తలుచుకుంటే సాధించలేనిది ఏమీ లేదని తమ స్కిల్స్ ను ఉపయోగించి దేశ పునర్నిర్మాణానికి అవసరమైన మేధోసంపత్తిని పెంపొందించుకోవాలని పేర్కొన్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు