హైదరాబాద్, 28 జూన్ (హి.స.)
ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు ఎన్నటికీ ఆస్కారం ఉండకూడదని బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కేటీఆర్ సూచించారు. శాంతియుతంగా ఉండాలని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఫోన్ ట్యాపింగ్ పై ఒక ప్రైవేటు ఛానల్ ప్రసారం చేసిన కార్యక్రమంపై ఆగ్రహించిన బిఆర్ఎస్ కార్యకర్తలు ఆ ఛానల్ కార్యాలయంపై దాడి చేసి విధ్వంసం సృష్టించారు.. దీనిపై స్పందించిన కెటిఆర్ ఇటువంటి దాడులు మంచివి కాదంటూ తమ పార్టీ నేతలకు, కార్యకర్తలకు హితవు పలికారు. రేవంత్రెడ్డి లాంటి నేతలు ఈ రాష్ట్రాన్ని నడిపిస్తుంటే, అబద్ధాలు, దుష్ప్రచారం అంశాలుగా సమాజంలో రోజువారి సాధారణ అంశాలుగా మారిపోతాయని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు ఎన్నటికీ ఆస్కారం ఉండకూడదని సూచించారు. శాంతియుతంగా ఉండాలని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..