ప్రభుత్వాలు ప్రజల క్షేమాన్ని మర్చిపోతే దాన్ని గుర్తు చేయాల్సిన బాధ్యత ప్రతిపక్షాలదే.. ఎంపీ ఈటెల రాజేందర్
హైదరాబాద్, 28 జూన్ (హి.స.) ప్రజాస్వామ్యం పరిడవిల్లాలంటే అధికార పక్షంతో పాటు ప్రతిపక్షం కూడా బలంగా ఉండాలని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ప్రభుత్వాలు ప్రజల క్షేమాన్ని మర్చిపోతే దాన్ని గుర్తు చేయాల్సిన బాధ్యత ప్రతిపక్షాలదేనన్నారు. కానీ ఇవాళ ద
ఈటెల రాజేందర్


హైదరాబాద్, 28 జూన్ (హి.స.)

ప్రజాస్వామ్యం పరిడవిల్లాలంటే

అధికార పక్షంతో పాటు ప్రతిపక్షం కూడా బలంగా ఉండాలని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ప్రభుత్వాలు ప్రజల క్షేమాన్ని మర్చిపోతే దాన్ని గుర్తు చేయాల్సిన బాధ్యత ప్రతిపక్షాలదేనన్నారు. కానీ ఇవాళ దేశంలో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ విదేశాల్లో దేశ గౌరవాన్ని, రాజ్యాంగాన్ని, దేశ ప్రజలను అపహాస్యం చేస్తోందన్నదని విమర్శించారు.

ఇవాళ నాచారంలోని ఓ పాఠశాలలో నిర్వహించిన మాక్ పార్లమెంట్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఆయన.. ఇందిరా గాంధీ ఎమర్జెన్సీతో చీకటి అధ్యాయాన్ని రచిస్తే ప్రభుత్వాన్ని నడిపించే సారథి గొప్పగా ఉంటే ఎలా ఉంటుందో ఈ 11 ఏళ్లు మోడీ చూపించారన్నారు. డాక్టర్ విఫలం అయితే మనిషికి మాత్రమే నష్టం జరుగుతుంది, ఓ ఇంజనీర్ విఫలం అయితే ఓ కట్టడం మాత్రమే విఫలం అవుతుంది కానీ ఓ పొలిటీషియన్ సక్రమంగా లేకపోతే సమాజమే కూలిపోయే ఆస్కారం ఉంటుందన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande