తెలంగాణ, మెదక్. 28 జూన్ (హి.స.)
సీజనల్ వ్యాధుల విషయంలో
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మున్సిపాలిటీ అభివృద్ధి దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. శనివారం నర్సాపూర్ మున్సిపాలిటీలో ఆయన విస్తృతంగా పర్యటించి, వివిధ వార్డుల్లో ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పట్టణ ప్రజలు బాధ్యతతో మెలిగి, పరిసరాల పరిశుభ్రతకు మున్సిపాలిటీ సిబ్బందితో కలిసి పనిచేయాలని సూచించారు. పరిశుభ్రత సీజనల్ వ్యాధుల నివారణకు కీలకమని ఆయన తెలిపారు. ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించే దిశగా చర్యలు తీసుకోవాలని, మున్సిపాలిటీలను ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దాలని చెప్పారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు