మహబూబాబాద్, 28 జూన్ (హి.స.)
మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ శనివారం మహబూబాబాద్ మండలం సంద్రాలగూడెం, కురవి మండల కేంద్రాల్లోని జిల్లా పరిషత్ హై స్కూల్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పథకం అర్హులైన ప్రతి పేద కుటుంబానికి అందేలా జిల్లా యంత్రాంగం వేగంగా చర్యలు తీసుకుంటోందన్నారు. ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేసి, ప్రభుత్వ సూచనల మేరకు పనులు ప్రారంభించామన్నారు.
ఇంటి నిర్మాణానికి అవసరమైన వసతులను క్షేత్రస్థాయిలో అందిస్తున్నామని పేర్కొన్నారు. స్వయం సహాయక బృందాలలో సభ్యులుగా ఉన్న మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చి, వారు ఇండ్లు నిర్మించుకునేలా ప్రభుత్వం సాయమందిస్తున్నదన్నారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..