తెలంగాణ, నారాయణపేట. 28 జూన్ (హి.స.)
ప్రజా ప్రభుత్వంలో వ్యవసాయానికి, రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని రాష్ట్ర పశుసంవర్ధక క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి అన్నారు. రైతు సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నామని, అందులో భాగంగా దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో రూ.2లక్షల రైతు రుణమాఫీ చేయడం జరిగిందన్నారు. నియోజకవర్గంలో 362కోట్ల రూపాయల రుణమాఫీ అందించినట్లు చెప్పారు. శనివారం నియోజకవర్గ కేంద్రమైన మక్తల్ పట్టణంలోని వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద మంత్రి రైతులకు ఉచిత కంది విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని రైతులకు అందజేసే ప్రారంభించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ… వ్యవసాయ శాస్త్రవేత్తల పరిశోధనలో ఉత్పత్తి చేయబడ్డ విత్తనాలను రైతులకు ప్రభుత్వం ఉచితంగా అందిస్తోందన్నారు. రైతులు పంటలు పండించి ఆర్థికంగా ఎదగాలన్నదే ప్రజా ప్రభుత్వం లక్ష్యమన్నారు. ప్రతి రైతు విత్తనాలను ఉత్పత్తి చేసే స్థాయికి ఎదగాలన్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు