అమరావతి, 28 జూన్ (హి.స.)
,:మద్యం కుంభకోణం కేసులో తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ వైసీపీ నేత చెవిరెడ్డి మోహిత్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ శుక్రవారం హైకోర్టులో విచారణకు వచ్చింది. పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలని సీఐడీ అధికారులను ఆదేశించింది. విచారణను జూలై 2కి వాయిదా వేసింది. తొందరపాటు చర్యలు తీసుకోకుండా సీఐడీ అధికారులను నిలువరించాలన్న పిటిషనర్ అభ్యర్థనను తోసిపుచ్చింది. ముందస్తు బెయిల్ కోసం విజయవాడ కోర్టులో పిటిషన్ వేసినందున ఈ విషయాన్ని అక్కడే తేల్చుకోవాలది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డి ఉత్తర్వులిచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ