హైదరాబాద్, 28 జూన్ (హి.స.)
ప్రముఖ తెలుగు న్యూస్ యాంకర్ స్వేచ్ఛ వోటార్కర్ (40) ఆత్మహత్య చేసుకున్నారు. శుక్రవారం రాత్రి చిక్కడపల్లిలోని తన నివాసంలో ఆమె బలవన్మరణానికి పాల్పడింది. చిక్కడపల్లి ఇన్స్పెక్టర్ రాజు నాయక్ వెల్లడించిన వివరాల ప్రకారం.. జవహర్నగర్లోని తన ఇంట్లో శుక్రవారం రాత్రి సుమారు 10:30 గంటల సమయంలో ఆమె బలవన్మరణానికి పాల్పడ్డారు. ఫ్యానుకు లుంగీతో ఉరేసుకుని ఆమె ప్రాణాలు విడిచినట్లు పోలీసులు గుర్తించారు. ఇలా ఉండగా స్వేచ్ఛ మృతిపై కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
తెలంగాణ ఒక ప్రతిభ కలిగిన మహిళా మేధావిని కోల్పోయిందిని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ విషాద సమయంలో స్వేచ్ఛ కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా ఆమె కుమార్తెకు, తల్లికి ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. ఇంతటి బరువైన విషాదకర సమయంలో వారి కుటుంబం స్థైర్యాన్ని పొందాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపిన కేటీఆర్, స్వేచ్ఛ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నానన్నారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..